Wednesday, 7 January 2026

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1665వ రోజు ‘రైతు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రీ రంజోల్కర్, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆర్. రమాదేవి, పొన్నాల ధనమ్మ, జె. వి. కుమార్ చేపూరి, పత్తిపాటి పుష్పలత రాసిన కవితలు 2026 జనవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment