ఏకాంశ కవిత్వం- 150వ వారం- అంశం: మల్లెపూలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 954వరోజు ‘మల్లెపూలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, నగునూరి రాజన్న, జక్కని గంగాధర్, నారుమంచి వాణీప్రభాకరి, కె.కె.తాయారు, వి. సంధ్యారాణి, పురం మంగ, ఎ.రాజ్యశ్రీ, లీలారెడ్డి, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839