ఏకాంశ కవిత్వం-268వ వారం- అంశం: కొరియర్ బాయ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1687వ రోజు 'కొరియర్ బాయ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో వి.సంధ్యారాణి, నగునూరి రాజన్న, పొన్నాల ధనమ్మ, నాగరాజు చుండూరి, డా.సి వసుంధర, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 జనవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839






