ఏకాంశ కవిత్వం- 154వ వారం- అంశం: అమ్మ అల్లం-ఆలి బెల్లం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 979వరోజు ‘అమ్మ అల్లం-ఆలి బెల్లం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, పగడాల రెడ్డెమ్మ, గుండం మోహన్ రెడ్డి, జక్కని గంగాధర్ రాసిన కవితలు 2023 అక్టోబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839