ఏకాంశ కవిత్వం- 142వ వారం- అంశం: కుంభవృష్టి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 907వరోజు ‘కుంభవృష్టి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి, జక్కని గంగాధర్, కనకయ్య మల్లముల, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఏడెల్లి రాములు రాసిన కవితలు 2023 జులై 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
**