ఏకాంశ కవిత్వం-266వ వారం- అంశం: కీర్తి కండూతి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1683వ రోజు ‘కీర్తి కండూతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నాగరాజు చుండూరి, పి.పద్మావతి, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, లక్ష్మారెడ్డి పసుల, కె.కె. తాయారు, గుర్రాల వేంకటేశ్వర్లు, మాడుగుల నారాయణమూర్తి, గుండవరం కొండల్ రావు, ఎ. రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 జనవరి 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:
Post a Comment