ఏకాంశ కవిత్వం- 134వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 859వరోజు ‘తొమ్మిదేళ్ల తెలంగాణ- సాధించిన విజయాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల, కనకయ్య మల్లముల, ఆర్.ప్రవీణ్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 జూన్ 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * *