Thursday, 2 July 2026

ఏకాంశ కవిత్వం- 289వ వారం- అంశం: రక్తదానం


 ఏకాంశ కవిత్వం- 289వ వారం- అంశం: రక్తదానం                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

 ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1811వ రోజు ‘రక్తదానం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, పొన్నాల ధనమ్మ, ఆర్. రమాదేవి, విత్తనాల విజయకుమార్, గుండం మోహన్ రెడ్డి, గిరిమాజి దామోదర్, ఇమ్మడి రాంబాబు, ఎం. వి. ఉమాదేవి, కోలా సత్యనారాయణ, డా. సి. వసుంధర  రాసిన కవితలు 2026  జులై 2  వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-అడ్మిన్:డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు  

-ఈవారం ఏకాంశ కవిత్వ నిర్వహణ: గోస్కుల శ్రీలత    

No comments:

Post a Comment