ఏకాంశ కవిత్వం-269వ వారం- అంశం: ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1689వ రోజు 'ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా? ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, కోలా సత్యనారాయణ, జె.వి.కుమార్ చేపూరి, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:
Post a Comment