Wednesday, 5 November 2025

ఏకాంశ కవిత్వం-257వ వారం- అంశం: మౌనవ్రతం

ఏకాంశ కవిత్వం-257వ వారం- అంశం: మౌనవ్రతం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1608వ రోజు ‘మౌనవ్రతం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, కాటేగారు పాండురంగ విఠల్, శేషారావు వైద్య, ప్రశాంతి రేవూరి, పొన్నాల ధనమ్మ, పి.పద్మావతి, మోటూరి శాంతకుమారి, మాడుగుల నారాయణమూర్తి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 అక్టోబరు 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

 

No comments:

Post a Comment