ఏకాంశ కవిత్వం-248వ వారం- అంశం: విద్యుత్తు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1545వ రోజు ‘విద్యుత్తు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, పొన్నాల ధనమ్మ, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణజ్యోతి, డా.సి.వసుంధర, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 ఆగస్టు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839




