ఏకాంశ కవిత్వం- 211వ వారం- అంశం: పత్రికలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1321వ రోజు 'పత్రికలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, దేశపతి కృష్ణమూర్తి, రేవిణిపాటి రమాదేవి, డా.రమ్యా స్వరూప్, విజయలక్ష్మి వడ్డేపల్లి, రజనీ కులకర్ణి, ముద్దు వెంకటలక్ష్మి, జక్కని గంగాధర్, రాజప్ప, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 డిసెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
No comments:
Post a Comment