ఏకాంశ కవిత్వం- 182వ వారం- అంశం: మండు వేసవి- మెండు వర్షం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1156వ రోజు ‘మండు వేసవి- మెండు వర్షం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మధు జెల్లా, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, గుండం మోహన్ రెడ్డి, ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 మే 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు