ఏకాంశ కవిత్వం- 166వ వారం- అంశం: కాకి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1051వ రోజు ‘కాకి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, రజని కులకర్ణి, మన్నె లలిత, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 జనవరి 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment