ఏకాంశ కవిత్వం- 164వ వారం- అంశం: లెక్కలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1041వ రోజు ‘లెక్కలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నె లలిత, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, జక్కని గంగాధర్, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, నారుమంచి వాణీ ప్రభాకరి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 జనవరి 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment