ఏకాంశ కవిత్వం-229వ వారం- అంశం: శిక్షణ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1432వ రోజు ‘శిక్షణ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుండం మోహన్ రెడ్డి, ముద్దు వెంకటలక్ష్మి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల, నగునూరి రాజన్న, గుర్రాల వేంకటేశ్వర్లు, రజనీ కులకర్ణి, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2025 ఏప్రిల్ 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment