ఏకాంశ కవిత్వం-228వ వారం- అంశం: కవిత్వమొక తీరని దాహం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1428వ రోజు ‘కవిత్వమొక తీరని దాహం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రానవేయిన రమేశ్, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా.సి.వసుంధర, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, కోలా సత్యనారాయణ, డా.షహనాజ్ బతుల్, ఎం.వి.ఉమాదేవి, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2025 ఏప్రిల్ 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment