Thursday, 13 February 2025

ఏకాంశ కవిత్వం-221వ వారం- అంశం: ‘కాలింగ్ బెల్’



ఏకాంశ కవిత్వం-221వ వారం- అంశం: ‘కాలింగ్ బెల్’                                                                                                                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1383వ రోజు ‘కాలింగ్ బెల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, నాగిరెడ్డి అరుణ జ్యోతి, మోటూరి శాంతకుమారి, డా.సి.వసుంధర, కె.కె.తాయారు, నగునూరి రాజన్న, ఆర్.రమాదేవి, జక్కని గంగాధర్ రాసిన కవితలు 2025 ఫిబ్రవరి 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                 

No comments:

Post a Comment