Thursday, 19 September 2024

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.       

ఈ దైనందిన కార్యక్రమాన్ని గత 200 వారాలుగా నిరంతరాయంగా ‘నేటినిజం’ దినపత్రిక ప్రచురిస్తోంది. ఈ ప్రచురణ 200 వారాల మైలురాయిని చేరిన సందర్భంగా 'మానవత్వం’ అనే అంశాన్ని 1267వ రోజు ప్రత్యేక ఏకాంశంగా ప్రకటించారు ‘నేటినిజం’ సంపాదకులు బైసా దేవదాసు గారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. పోరెడ్డి రంగయ్య, గుర్రాల వేంకటేశ్వర్లు, నాగిరెడ్డి అరుణజ్యోతి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనపర్తి లక్ష్మయ్య, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, డా. సి.వసుంధర, ఆర్. రమాదేవి, లోడె రాములు, శేషారావు రాసిన కవితలు 2024 సెప్టెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

No comments:

Post a Comment