Wednesday, 12 June 2024

ఏకాంశ కవిత్వం- 186వ వారం- అంశం: బడుల పునఃప్రారంభం

 



ఏకాంశ కవిత్వం- 186వ వారం- అంశం: బడుల పునఃప్రారంభం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1183వ రోజు ‘బడుల పునఃప్రారంభం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, ప్రభాకర్ రావు గుండవరం, కె.కె.తాయారు, పరిమి వెంకట సత్యమూర్తి, ఎ.రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి  పసుల, గుండం మోహన్ రెడ్డి, నగునూరి రాజన్న, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 జూన్ 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment