ఏకాంశ కవిత్వం- 156వ వారం- అంశం: ఓటు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో ఇప్పటివరకు 1000 అంశాలపై కవిత్వ రచన జరిగింది. 'ఓటు' అనే అంశాన్ని 1000 వ అంశంగా సుప్రసిద్ధ కవి, రచయిత డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రకటించారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శనగపల్లి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మీ శ్రీనివాస్, శ్రీలత రమేశ్ గోస్కుల, జె.నరసింహారావు, ఎం. వీరకుమారి, పోచం సుజాత, డా. దేవులపల్లి పద్మజ, గుండం మోహన్ రెడ్డి, గుడికందుల ప్రకాశం రాసిన కవితలు 2023 నవంబరు 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment