Wednesday, 28 June 2023

ఏకాంశ కవిత్వం- 138వ వారం- అంశం: పలకరించిన తొలకరి



ఏకాంశ కవిత్వం- 138వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 885వరోజు ‘పలకరించిన తొలకరి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.నరసింహారావు, నారుమంచి వాణీ ప్రభాకరి, కనకయ్య మల్లముల, మోటూరి శాంతకుమారి, వీరకుమారి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, ఆర్.ఎస్. వెంకటేశ్వరన్, జగన్నాథ్ వెలిదిమళ్ల రాసిన కవితలు 2023 జూన్ 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

    9441046839

****

No comments:

Post a Comment