ఏకాంశ కవిత్వం- 173వ వారం- అంశం: ‘ముఖపుస్తకం కాసేపు ముఖం చాటేస్తే?!’
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1105వ రోజు ‘ముఖపుస్తకం కాసేపు ముఖం చాటేస్తే?!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, రాజప్ప, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి, జె.వి.కుమార్ చేపూరి, జక్కని గంగాధర్, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 మార్చి 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment