ఏకాంశ కవిత్వం- 172వ వారం- అంశం: వర్కింగ్ ఉమన్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1101వ రోజు ‘వర్కింగ్ ఉమన్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, శ్రీలతరమేశ్ గోస్కుల, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, రజనీ కులకర్ణి, చంద్రకళ దీకొండ, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, అయ్యలసోమయాజుల ప్రసాద్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2024 మార్చి 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment