అక్షరం గ్రూప్ నిర్వహించే మినీ కథల పోటీ
🪷🪷🪷🪷🪷🪷🪷
మహిళా దినోత్సవం-2024
సందర్భంగా *మహిళా ప్రాధాన్యత*గా మినీ కథల పోటీ నిర్వహిస్తున్నాము.కధ ఒక పేజీ కన్నా మించరాదు. మీకధ ఈ పోటీ కోసం మాత్రమే రాసినది అని హామీపత్రంలో రాయాలి. మీరు అక్షర సమూహంలో సభ్యులయి ఉండాలి👍
మేము కథల పోటీలు కవితల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే వున్నాము. వారానికి కనీసం 1,2 పోస్టులు గ్రూప్ లో పెట్టని వారు కూడా పోటీలలో మాత్రం పాల్గొంటున్నారు.మన గ్రూపులో 150 కి పైన సభ్యులు వున్నారు.60కి పైగా మహిళా సభ్యులు వున్నారు. కానీ రోజుకు ఎంతమంది గ్రూపులో పోస్ట్ లు పెడుతున్నారు? రెగ్యులర్ గా పాల్గొంటూ, ఇతరులు రాసిన రచన లపై స్పందించే వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. మరల ఈ పోటీలు ఉగాది కి కూడా ఉంటాయి. ప్రస్తుతం *మహిళా సభ్యులుకు* మాత్రమే ఈ పోటీ.
నిబంధనలను అనుసరించి రాసిన కధలను, అర్హత పొందిన కధలను మాత్రమే పోటీకి తీసుకుంటాము. పోటీలో పాల్గొనే వారు తమ కధలను ఫిభ్రవరి 29 రాత్రి వరకు పంపవచ్చు. ఆ తర్వాత వచ్చిన కధలు స్వీకరించబడవు. ఈ కధలకి శ్రీమతి బాల భారతి గారు తమ అమ్మానాన్నలు పద్మ కేశవ అవార్డుపేరు మీద నగదు బహుమతులను అందిస్తున్నారు..
ప్రధమ బహుమతి..1000
రూ
ద్వితీయ బహుమతి..800రూ
తృతీయ బహుమతి..600రూ
ప్రోత్సహాక బహుమతి.. 200రూ (ముగ్గురికి)
కధలు పంపడానికి త్వరలోనే లింక్ పంపుతాను. అప్పుడే పోస్ట్ చెయ్యండి. 🪷
డా.పాతూరి అన్నపూర్ణ.. గ్రూప్ వ్యవస్థాపక
అధ్యక్షురాలు 🪷
No comments:
Post a Comment