ఏకాంశ కవిత్వం- 149వ వారం- అంశం: అమ్మమ్మ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 946వ రోజు ‘అమ్మమ్మ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కనకయ్య మల్లముల, నాగరాజు చుండూరి, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, గుండవరం కొండల్ రావు, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, అరుణ కోదాటి, వాడపల్లి రాధ, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment