ఏకాంశ కవిత్వం- 148వ వారం- అంశం: ఆప్యాయత
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 945వరోజు ‘ఆప్యాయత’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణి ప్రభాకరి, కె.కె.తాయారు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, చంద్రకళ దీకొండ, ఎం. వి. ఉమాదేవి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, వి.నాగజ్యోతి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment