ఏకాంశ కవిత్వం- 141వ వారం- అంశం: చంద్రయానం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 902వరోజు ‘చంద్రయానం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, కపిలవాయి అశోక్ బాబు, ఎం. వి. ఉమాదేవి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కె.కె.తాయారు, కందుకూరి మనోహర్, వాడపల్లి రాధ, గుండవరం కొండల్ రావు, జె.వి.కుమార్ చేపూరి, ఎం.వీరకుమారి రాసిన కవితలు 2023 జులై 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
**
No comments:
Post a Comment