Sunday, 2 July 2017

అన్వయ దోషం


మొన్న లంచ్ బెల్లు తర్వాత మొదటి పీరియడ్ బెల్లు కాగానే ఏడో తరగతి చదివే ఒక విద్యార్థి దగ్గరికొచ్చాడు. విషయమడిగితే "మా అమ్మ మా నాన్న చచ్చిపోయిండని చెప్పింది సార్" అన్నాడు. ఏడుస్తున్న ఆ విద్యార్థిని అనునయించాను. ఇంటికి పంపించాను. తీరా వేరే పిల్లలని అడిగితే చనిపోయింది ఆ విద్యార్థి తండ్రి కాదని, తాత అని తెలిసింది. అప్పుడు అతను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నా. తేలిందేంటంటే "మా నాన్న చనిపోయాడు" అని ఆ విద్యార్ధి తల్లి చెప్పింది అతనితో. పరోక్ష కథన పద్ధతి ఆ విద్యార్థికి తెలియకపోవడంతో నేను తప్పుగా అర్థం చేసుకున్నా.
ఇంతకీ దోషం ఎవరిది? అతను చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోలేని నాదా? అన్వయ దోషంతో చెప్పిన ఆ విద్యార్థిదా?

No comments:

Post a Comment